ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 5:48 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పెళ్లయిన 18 రోజులకే కాలేజ్ బిల్డింగ్‌పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని

యాదాద్రి భువనగిరి,అర్జున్ సమాచారం:
మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన ఏనుగు మధుసూదన్ రెడ్డి కుమార్తె పల్లవి (20).. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది

ఈ ఏడాది ఆగస్టు 30న చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో పల్లవికి వివాహం జరిపించిన పెద్దలు

పెళ్లయిన కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం భర్త నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులు మొదలవడంతో వాటిని భరించలేక తాను చదువుతున్న కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

తొలుత జీడిమెట్లలోని నీలిమ ఆసుపత్రికి, అనంతరం మేడిపల్లిలోని శ్రీకర ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో పల్లవి మృతి

పల్లవి తల్లి సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నారు..
========================